డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్, ఫాలోయింగ్‌ వేరే స్థాయిలో ఉంటుంది. ప్రతి సినిమాలో తనదైన స్టైల్‌ తో, మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ప్రభాస్ ఎప్పటికప్పుడు తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.ఆయన నటించిన భారీ ప్రాజెక్టులు సలార్, కల్కి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి. ఈ రెండు చిత్రాల తర్వాత కూడా ప్రభాస్ షెడ్యూల్‌లు బిజీగా ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులపై ఆడియెన్స్‌ లో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో, స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక భారీ సినిమా ఫిక్స్ అయిందన్న వార్త ఫిల్మ్‌ నగర్‌ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈ కాంబినేషన్‌ సెట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా దిల్ రాజే అని చెబుతున్నారు. చాలా కాలంగా దిల్ రాజు ప్రభాస్‌తో మరో పెద్ద సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ కావాలనే ఆశ ఫ్యాన్స్‌ లో ఎప్పటినుంచో ఉంది.

ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే – ఆయన చెప్పే కథలు, చూపించే విజువల్ ప్రెజెంటేషన్, హ్యూమన్ ఎమోషన్స్ మరియు మైండ్ గేమ్స్‌ తో మిళితమైన స్క్రీన్‌ప్లే ఎప్పుడూ ప్రేక్షకులను మైమరపిస్తూనే ఉంటాయి. రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలతో ఆయన కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. అలాంటి సుకుమార్‌తో ప్రభాస్‌ కలిస్తే — ఆ కాంబినేషన్‌ నిజంగా “వేరే లెవెల్” లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు ముగింపు దశలో ఉన్నాయని, దీపావళి సందర్భంగా ఈ బిగ్ అనౌన్స్మెంట్ రావచ్చని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్ గా సుక్కు..ప్రభాస్ సీక్రేట్ మీట్ కూడా అయిపోయిందట. అది నిజమైతే మాత్రం ప్రభాస్ అభిమానులకు ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్‌ అవుతుంది — ఒకవైపు పండుగ సంబరం, మరోవైపు తమ డార్లింగ్‌ కొత్త సినిమాకి భారీ అప్‌డేట్!

ఇప్పటివరకు ప్రభాస్ మరియు సుకుమార్ కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాకపోవడం ఫ్యాన్స్‌ కి ఒక పెద్ద మిస్సింగ్ ఫీలింగ్ గా ఉంది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్‌ భర్తీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ అధికారికంగా అనౌన్స్ అయితే అది టాలీవుడ్‌ లో వచ్చే దశాబ్దానికి ఒక గేమ్ ఛేంజర్ అవ్వొచ్చు.ప్రస్తుతం ప్రభాస్ తన ప్రస్తుత కమిట్‌మెంట్‌ ప్రాజెక్టులైన సలార్ పార్ట్ 2, కల్కి సీక్వెల్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందట. ప్రభాస్‌ వంటి పాన్ ఇండియా స్టార్‌, సుకుమార్‌ వంటి విజనరీ డైరెక్టర్‌, దిల్ రాజు వంటి పర్ఫెక్షనిస్ట్‌ ప్రొడ్యూసర్‌ — కలిసి వస్తే అది ఒక సెన్సేషన్ బియాండ్ ఇమాజినేషన్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.చూడాలి మరి... ఈ దీపావళికి నిజంగా ఆ బిగ్ బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్‌ వస్తుందా లేదా అనేది!


మరింత సమాచారం తెలుసుకోండి: