యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `బాహుబ‌లి` త‌ర్వాత నేష్న‌ల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సుజిత్ దర్శకత్వం లో  నటిస్తున్న చిత్రం `సాహో`. శ్రద్దా క‌పూర్ ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ముందుగా ఆగ‌ష్టు 15న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగ‌ష్టు 30కి వాయిదా ప‌డింది.


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజ‌ర్లు మ‌రియు ప్ర‌భాస్ లుక్స్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుద‌లైన ‘సాహో’ ట్రైలర్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంటే ఇటు హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ గ్లామర్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొడుతుంది.


ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సాహో జ‌రుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ రికార్డుల ప‌రంప‌ర‌లో మ‌రో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆగ‌ష్టు 30న ప్రతిష్టాత్మకంగా విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. అయితే ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే అవ‌కాశం ఉండ‌డం విశేషం. 


అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ నుంచి నాలుగు సినిమాలు మాత్రం ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి  కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను మాత్ర‌మే ఈ ఛాన్స్ ద‌క్కింది. ఇప్పుడు ఐదో సారి సాహోకు ఈ ఛాన్స్‌ ద‌క్క‌డం ఓ అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్ప‌టికే ఈ థియేట‌ర్ వ‌ద్ద సాహో సినిమా ప్రమోషన్‌లు జ‌రుపుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: