`బాహుబలి` సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్స ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ‘సాహో’ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరియు జాకీ ఫ్రాష్, నీల్ నితిన్ ముఖేష్,అరుణ్ విజయ్, చుంకీ పాండేలు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు మరియు ఫస్ట్ లుక్స్తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. పక్కా యాక్షన్ పార్ట్ తో ట్రైలర్ కట్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ పార్ట్ ఉండటంతో ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలకు ఫిక్స్ చేశారట. అలాగే స్మోకింగ్ యాడ్స్తో కలిపి దాదాపు 2 గంటల 50 నిమిషాల అని తెలుస్తోంది.
నిజానికి ఇంత టైంలో సినిమా బాగుంటే దానిలో లీనమై పోతారు ప్రేక్షకులు.. లేదంటే తిప్పికొడతారు. అయితే సాహో మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాబట్టి లెంగ్త్ ఎక్కువైనా పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ను ఓ రేంజ్లో జరుపుకునేందుకు రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు.