పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమా వెనుక అసలుసిసలైన బాగోతం మరోటి వెలుగుచూసింది. రాజకీయ పరిస్థితులు, మెగా అభిమానుల నిరసనల మద్య ఈ సినిమా విడుదల ఆలస్యమయింది అని అందరు భావించారు, కాని అసలు కారణం అది కాదని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాత బిఎస్వీఎన్ ప్రసాద్ డిస్ట్రిబ్యూటర్లకు పాత వాటికి సంబందించిన 25 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందట. అవి చెల్లిస్తే కాని  ఈ సినిమా అంటే ‘అత్తారింటికి దారేది’ ని విడుదల చేయం అని తెగేసి చెప్పారని తాజాగా వినిపిస్తున్న మాటలు. అంత డబ్బులేక సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాడు ప్రసాద్ అంటున్నారు.

అయితే మెగా హీరోలకు, కుటుంబానికి ఇటువంటి విషయాల్లో ఆపధ్బాందవుడు లాంటి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కలగచేసుకుని రెండు రోజుల్లో 25 కోట్లు సర్దుబాటు చేసి డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పించి సినిమా విడుదలకు మార్గం సుగమం చేసాడంటున్నారు. ఈ విషయంలో దగ్గుపాటి సురేష్ కూడా కొంత సాయం చేసాడంటున్నారు. ఇన్ని అవాంతరాలను దాటి వస్తున్న ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ అవుతుందా అనేదే అందరి ఆతృత.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: