ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్నది ప్రభాస్ సాహో పేరే. యూట్యూబ్
లో చూస్తే అక్కినేని నాగార్జున మన్మధుడు 2 టీజర్. ప్రభాస్ యాక్షన్ తో
అదరగొడితే.. నాగ్ రొమాన్స్ తో దంచేశాడు. పక్కా మాస్ భాషలో చెప్పాలంటే
ఉతికి ఆరేశారు. టీజర్ కాబట్టి చూపించి చూపించనట్టుగా చూపించారు.
ఇంకా
ముందు ట్రైలర్ రిలీజ్ కావాలి. ట్రైలర్ తరువాత... ఆడియో వేడుక, ప్రీ
రిలీజ్ బిజినెస్, ప్రమోషన్స్ అబ్బో ఒకటేమిటి అనేకం ఉన్నాయి ముందు. ఇంతవరకు
సరే... ఇప్పుడు డైరెక్టర్ల విషయానికి వద్దాం. రన్ రాజా రన్ వంటి మంచి
సినిమా తీసిన సుజిత్ కు సాహో తో అవకాశం ఇచ్చారు.
రన్
రాజా రన్ అన్నది చిన్న సినిమా. అయినా దర్శకుడు ఆ సినిమాను తీసిన విధానం
అందరికి నచ్చింది. అందుకే కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ను సుజిత్
చేతిలో పెట్టింది యూవీ క్రియేషన్స్ సంస్థ. సుజిత్ కూడా పెట్టిన దానికి
న్యాయం చేశారని అనుకోవచ్చు.
ఇక మన్మధుడు 2
విషయానికి వస్తే.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఇది రెండో సినిమా.
నటుడిగా ప్రయాణం ప్రారంభించిన రాహుల్ చిలసౌ తో దర్శకుడిగా మారారు. ఆ
సినిమా ఎంటర్టైన్ చేసింది. అందుకే నాగ్ ఈ మూవీని రాహుల్ చేతిలో పెట్టాడు.
రాహుల్ కథను చెప్పినపుడు ఒకే చెప్పిన నాగ్.. స్క్రిప్ట్ విషయంలో మాత్రం
అనేక మార్పులు చేయించినట్టు సమాచారం. సాహో, మన్మధుడు 2 సినిమాల దర్శకులకు
ఇది రెండో సినిమా .. ద్వితీయ విఘ్నాన్ని నిర్విఘ్నంగా దాటాలని
కోరుకుందాం.