‘సాహో’ విడుదలకు ఇక కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్ ను పరుగులు తీయిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ఈమూవీ కోసం వరసపట్టి అనేక పత్రికలకు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో ప్రభాస్ ‘సాహో’ కోసం తాను తీసుకున్న పారితోషిక విషయమై ఇచ్చిన లీకుల విషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

‘సాహో’ బడ్జెట్ 350 కోట్లు దాటిపోవడంతో ఈమూవీ నిర్మాతలకు ఒత్తిడి పెరగకుండా కేవలం తాను 20 శాతం పారితోషికం మాత్రమే ఈ సినిమాకు సంబంధించి తీసుకున్నానని ప్రభాస్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీలో నటించినందుకు ప్రభాస్ కు 100 కోట్ల పారితోషికం ఇచ్చారు అంటూ వస్తున్న వార్తలను పరోక్షంగా ఖండిస్తూ ప్రభాస్ ఈ లీకులు ఇచ్చాడు అని కొందరు భావిస్తున్నారు. 

మరికొందరైతే ప్రభాస్ పారితోషికం కలపకుండానే ‘సాహో’ బడ్జెట్ 350 కోట్లు అయిపోయింది అంటే ఈమూవీ బడ్జెట్ ఏస్థాయిలో ఉందో అంచనాలు పెంచడానికి ప్రభాస్ ఇలా కామెంట్స్ చేసాడు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ అంగీకరించినా అంగీకరించకపోయినా ‘సాహో’ ను నిర్మించిన యువి క్రియేషన్స్ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ. 

అలాంటి పరిస్థితులలో ప్రభాస్ పారితోషిక విషయం ఎందుకు సమస్య అవుతుంది అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు జరగబోతున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముగిసిన తరువాత దేశంలోని వివిధ నగరాలలో ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభాస్ ఒక ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ ను వారంరోజులు అద్దెకు తీసుకున్నాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. ఈమూవీని ప్రభాస్ ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ అదే స్థాయిలో ఈమూవీ పై బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ప్రభాస్ కు లోలోపల కలవరపాటును కలిగిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: