అయితే అమెరికా ప్రవాసులతో పాటు బ్రిటన్ ప్రవాసులు కూడా భారత దేశానికి సహాయం అందించేందుకు నడుంబిగించారు. "బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్" ఆక్సిజన్ ఫర్ ఇండియా అనే ప్రచారం పేరుతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నది. బ్రిటిష్ ఇండియన్స్ మరొక క్యాంపెయిన్ "గో ఫండ్ మీ" నిర్వహిస్తూ 16 లక్షల పౌండ్లను సేకరించారు. అంటే మన కరెన్సీలో రూ. 16.5 కోట్లు అన్నమాట. ఈ విరాళాలు ఉపయోగించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి పంపిణీ చేస్తామని బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.
ఇకపోతే భారతదేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3 లక్షల 86 వేల కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మరణాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న కరోనా తో 3000 కు పైగా మృతి చెందారు. ప్రవాసులతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు భారతదేశానికి కోట్ల రూపాయలను అందిస్తున్నాయి. క్రీడాకారుల సైతం భారతీయుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయి లక్షల రూపాయలు విరాళాలు అందించారు. కెనడా ప్రభుత్వం ఏకంగా కోటి డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ విధంగా అంతర్జాతీయ సమాజం భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.