జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల నుంచి ఏపీలో స్పీడ్ పెంచి అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కొన్ని రోజులుగా. మంత్రులు కూడా ఆయన లక్ష్యంగా ఘాటుగా ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు నాంది అని అన్నారు.

వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి మిగిలిన కులాలను కలుపుకొని పోవాలి అనే వ్యాఖ్యలను సమర్దిస్తున్నాం అని అన్నారు ఆయన. పవన్ దానికి సారథ్యం వహించడం స్వాగతిస్తున్నాం అని ఆయన తెలిపారు. కమ్మ కులస్థులకు, రెడ్డి కులస్తులు వ్యతిరేకం, కాపు కులస్తులు కాదు  అని స్పష్టం చేసారు. జనసేన రాజ్యాధికారం దక్కించుకుంటే పరిపాలన ఈ నాటి ప్రభుత్వ పాలన లాగా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది అని అన్నారు ఆయన.

అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధించే విధంగా ఉంటుంది అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గ విధంగా ఉన్నాయి  అని అన్నారు. జనసేనాని ప్రతిపాదనలను కాపు సంక్షేమ సేన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది  అని పేర్కొన్నారు. కాపు మంత్రులు పవన్ కళ్యాణ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది  అని విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ ని అవమానపరచడం కాపు సమాజాన్ని అవమానపరచడం గా భావిస్తున్నాం అని అన్నారు. ఇటువంటి  చర్యల పర్యవసానం 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి చవి చూడవలసి వస్తుంది అని హెచ్చరిస్తున్నాం అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap