గత కొన్ని రోజులుగా సంచలన వ్యాహ్యలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాహ్యలు చేసారు. అమ్మకానికి భారత దేశం అంటూ... వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్న మొట్టమొదటి ప్రధాని మోడీ అని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని అన్నారు. కాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు అని మండిపడ్డారు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు అని అన్నారు.

దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపు లతో గుద్ది చంపించిన తొలి ప్రధాని, ఏపీలో విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నవరత్నాల పేరుతో పేదల నవారంధ్రాలు మూసివేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్ అన్నారు.  విద్యార్థులకు స్కాలర్షిప్ లు లేవు చదువుకోవాలంటే పేదవిద్యార్ధి అష్టకష్టాలు పడుతున్నారు అని త్వరలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.  అందుకే 80లక్షల విద్యార్థులకు  స్కాలర్షిప్స్ నవంబర్1వ తారీఖు  లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు అని తెలిపారు.

అనేకమంది రాజకీయ నాయకులు స్కాలర్షిప్ లతో చదుకున్నవారు కోకొల్లలు అని అన్నారు.  పేదవాడికి అన్యాయం జరుగుతుంది సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తుంది అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ఆదాని అభివృద్ధి కాదు పేదల అభివృద్ధి కావాలి అని అన్నారు.  చంద్రబాబు తొందరబాబు అని అవహేళన చేశారు అని రాజధాని రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి చేరుపుకు సిద్ధంగా ఉన్నది అని స్పష్టం చేసారు.

రాజధాని మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని గుర్తు చేశారు ఆయన.  రాజధాని రైతులకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుంది అని పేర్కొన్నారు. ప్రతి దళిత క్రిస్టియన్ కు ఎస్సి స్టేటస్ వచ్చేవిదంగా పోరాటం చేస్తామని తెలిపారు ఆయన. రాజధాని రైతులకోసం రాహుల్ గాంధీని తీసుకువస్తాం అని అన్నారు. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారు అది ఎవ్వరికీ తెలియదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: