ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీ పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గు మాన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.

Image result for tdp

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కుల రాజకీయాలు చేస్తోందని దారుణమైన కామెంట్లు చేశారు. టిడిపి కుల రాజకీయాలపైన, ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపైన చర్చకు సిద్దమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నానని ఆయన అన్నారు.

Image result for tdp bjp

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపవేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు.

Image result for gvl narasimha rao

మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్‌ కార్యక్రమానికి తెర తీశాడని నరసింహారావు ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న పథకాలను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుతున్నారని మరికొంతమందికి బిజెపి నాయకులు వ్యాఖ్యానించారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: