అయితే ఇటీవలే కేవలం ప్రత్యేకంగా రైతుల కోసం ఒక కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ పర్సనల్ గోల్డ్ లోన్ స్కీమ్ కింద రైతులు సులభంగానే రుణం పొందే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా అతి తక్కువ వడ్డీ రేటు కే ఈ లోన్ అందించేందుకు నిర్ణయించింది. ఈ స్కీమ్ కేవలం రైతులకు మాత్రమే వర్తిస్తుంది అంటూ నిబంధన విధించింది. అయితే రైతులు తమ బంగారంపై ఓవర్డ్రాఫ్ట్ పొందే ఫెసిలిటీ కూడా కూడా ఉంది అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అయితే రైతులు ఇలా లోన్ తీసుకున్న మొత్తాన్ని 12 నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎస్ బి ఐ బ్యాంక్ బ్రాంచ్ లలో ... ఇటీవలె స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన గోల్డ్ లోన్ స్కీమ్ కింద సులభంగా ఋణం పొందవచ్చు. అంతేకాకుండా రైతులకు ఇతర ఛార్జీలు ఏమీ ఉండకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోల్డ్ లోన్ పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక లోన్ పొందే ప్రాసెస్ కూడా ఎంతో సులభంగా ఉంటుందని స్టేట్ బ్యాంకు తెలిపింది. ఈ అవకాశాన్ని రైతుల సద్వినియోగ పరచుకోవాలి అంటూ సూచించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి