కరోనా వైరస్ బారిన పడి పరిస్థితి విషమించిన పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఒక వరంలా మారింది. క్రిటికల్ కండిషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను బతికించేందుకు డాక్టర్లు ఇప్పుడు ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఫోకస్ పెడుతున్నారు. కరోనాకు టీకాలు, మందులు వచ్చే వరకూ సీరియస్ కండిషన్ లోకి వెళ్లే పేషెంట్లను కాపాడేందుకు ఇదే బెటర్ అని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే పేషెంట్ల బంధువులకు ప్లాస్మా డోనర్లను తీసుకురావాలని సూచిస్తున్నారు. ఒక వ్యక్తి నుంచి తీసుకునే ప్లాస్మాతో ఇద్దరి నుంచి నలుగురిని కాపాడొచ్చని అంటున్నారు. సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మాథెరపీతో ప్రాణాలు నిలబడే ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు అందరి చూపు ప్లాస్మా డోనర్ల వైపు మళ్లింది.


పరిస్థితి విషమిస్తున్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేస్తే కోలుకోవచ్చని, ప్లాస్మా డోనర్స్ ను చూసుకోవాలని ఆ పేషెంట్ల బంధువులకు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో పేషెంట్ల కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో, తెలిసిన వారి ద్వారా డోనర్స్ కోసం వెతుకుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడెక్కడ ప్లాస్మా డోనర్స్ ఉన్నారో అని తెలుసుకుని మరీ కాల్స్ చేసి రిక్వెస్ట్ లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రిక్వెస్టులూ పెడుతున్నారు. అయినా డోనర్స్ నుంచి సరైన స్పందన రావడం లేదు. ప్లాస్మాను ఇస్తే మళ్లీ హెల్త్ పాడవుతుందేమోనని భయంతో ముందుకు రావడం లేదు.



కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్ మెంట్ కోసం మొదట ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేసింది. తర్వాత తమిళనాడు, బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు కూడా ప్లాస్మా బ్యాంకులు ప్రారంభించాయి. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్తకణాలు గుర్తించి, చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.



ఇటువంటి తరుణంలో బీజేపీకీ చెందిన బీజేవైఎం కేర్స్‌ కమిటీలో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడకు చెందిన కొంగళ్ల నవీన్‌ నియమితులయ్యారు. నవీన్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్లాస్మా కావాలన్నా, రక్తం కావాలన్నా, పేషెంట్‌లకు ఆస్పత్రులలో బెడ్‌ కావాలన్నా సమకూర్చడానికి బీజేవైఎం కేర్స్‌ కృషి చేస్తోందన్నారు. ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా 9989270380 నెంబర్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. కాబట్టి మీ పరిధిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోండి. ఇతరులకు సాయం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: