అయితే ప్రస్తుతం అందరు ఎక్కడ తమపై కరోనా వైరస్ పంజా విసురుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు.. ఇక్కడ ఒక జంట మాత్రం కరోనా వైరస్ సమయంలో కూడా పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి కుమారుడు తో పాటు అతని తల్లికి కూడా వైరస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక వారు పెళ్ళి వాయిదా వేసుకుంటారు అని అనుకున్నారు అందరు. కానీ అనుకున్న సమయానికి పెళ్లి జరగాలి అని భావించారు ఇరు కుటుంబాల సభ్యులు. దీంతో ఇక ఆసుపత్రి అధికారులను ఒప్పించి మరీ పెళ్లి జరిపించారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న తర్వాత కరోనా వైరస్ పంజా విసిరింది కానీ ఎక్కడ పెళ్లిని మాత్రం ఆపలేకపోయింది.
పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న సమయానికి పెళ్లి చేయాలని.. సాంప్రదాయం ప్రకారం పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అని భావించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి సిబ్బంది తో కూడా మాట్లాడారు ఇంకేముంది కరోన వార్డు వారికి ఫంక్షన్ హాల్ గా మారిపోయింది కరోనా రోగులే వారికి బంధువులు అయ్యారు. పీపీఈ కిట్లు పెళ్లి బంధువులుగా మారగా ఇక పట్టుచీరతో పెళ్లి చేసుకోవాల్సిన వధువు కాస్త పి పిఈ కిట్ ధరించింది. ఇలా పెట్టిన ముహూర్తానికి ఒకటయ్యారు జంట. అయితే ఈ పెళ్లి కాస్త జిల్లావ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి