ఇక ఈ మేకిన్ ఇండియా నినాదం తోనే ముందుకు సాగుతూ భారత్ ఎంతగానో వృద్ధి సాధిస్తోంది. చైనా దిగుమతుల పై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఆయుధాల విషయం లో కూడా ప్రపంచ దేశాల పై ఆధార పడ కూడదు అని నిర్ణయించుకుంది. మేకిన్ ఇండియా లో భాగంగా స్వదేశం లోనే ఆయుధాలను తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ కంపెనీ లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. విదేశీ ఆయుధ తయారీ సంస్థలు భారత్లో తమ కంపెనీ నెలకొల్పి ఆయుధా లను తయారు చేసి ఇవ్వనున్నారు.
ఇలా రక్షణ రంగాన్ని పటిష్ట వంతంగా మార్చేందుకు అటు భారత ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మరి కొన్ని రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం గా నిలువనుంది. ఇటీవలే మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మేకిన్ ఇండియా లో భాగం గా సబ్ మెరైన్ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది. ప్రాజెక్ట్ 715 అనే పేరుతో 43 వేల కోట్ల రూపాయల ఖర్చుతో సబ్ మెరైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఇది సక్సెస్ అయితే భారత్ సంచలనమే సృష్టించనుంది.