అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మొన్నటి వరకు భక్తులకు దర్శన పై ఆంక్షలు విధించిన టీటీడీ బోర్డు ప్రస్తుతం ఆంక్షలను సడలిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే కరోనా తిరుపతి వెళ్లేందుకు భయపడిన వారు ఇక ఇప్పుడు వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకొని శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక శ్రీవారికి నిత్యం ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు సిబ్బంది. ఈ క్రమంలోనే వివిధ రకాల నైవేద్యాలను శ్రీవారికి సమర్పిస్తూ ఉంటారు . కాగా శ్రీవారికి సమర్పించే నైవేద్యం లలో మరింత నాణ్యతను పెంచడంలో భాగంగా ఇటీవల టీటీడీ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక మరికొన్ని రోజుల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవకు గిర్ గోవులు రానున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే శ్రీవారికి రోజు ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా నైవేద్యం అఖండ దీపారాధన కోసం కిలోల కొద్దీ నెయ్యిని వినియోగిస్తుంటారు అయితే మొన్నటి వరకు ఇక నెయ్యి ప్రాంతాల నుంచి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కొండ పైన నెయ్యి తయారు చేసి వినియోగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే దేశి జాతి గోవులు పాలు అయితే బాగుంటుందని భావించారు. ఈ క్రమంలోనే గిర్ గోవులు ఇక తిరుమల కొండపైకి తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై ఐదు గిర్ గోవులు ఇక శ్రీవారి సేవ కోసం తరలివస్తున్నాయి. అయితే ఒక్కొక్క గిర్ గోవు రవాణా ఖర్చుల తో కలిపి ఇక 1.20 లక్షలు టీటీడీ అధికారులు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.