ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందిస్తున్న బియ్యం కార్డుల విషయంలో కూడా ఎంతోమంది అనర్హులు లబ్ది పొందుతున్నట్లు ఇటీవలే ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలోనే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. అర్హులైన వారికి మాత్రమే బియ్యం కార్డు ద్వారా లబ్ధి చేకూర్చాలని దీని కోసం అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవలే బియ్యం కార్డులు పరిశీలన కోసం పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది.
ఇక బోగస్ కార్డుల అన్నింటినీ ఏరివేసి అసలైన అర్హులకే బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం లో భాగంగా మూడు నెలల నుంచి రేషన్ తీసుకోకుండా ఉన్న వారి జాబితాలను సిద్ధం చేసి ఆయా మండలాలకు పంపింది. ఇలా మూడు నెలల నుంచి రేషన్ తీసుకోకుండా ఉన్న వారు అసలు గ్రామం లోనే ఉన్నారా.. గ్రామంలోనే ఉంటే రేషన్ తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు.. వారికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ తో అవసరం ఉందా లేదా అన్న విషయాలను కూడా గమనించనున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ విషయాలను అధికారులు పరిశీలిస్తారు. తగిన ఆధారాలు చూపించకపోతే బియ్యం కార్డు బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఏకంగా ఏడు లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి