పూర్తిగా దెబ్బతిన్నవారికి కొత్త ఇళ్లు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని ఆదేశించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  వచ్చే 3–4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలని...  అంతేకాక పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరు చేయాలని పేర్కొన్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  దీనివల్ల వారు వెంటనే పనులు ప్రారంభించగలుగుతారని... పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్‌ చురుగ్గా సాగాలని వెల్లడించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.
 
రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలని... ఈ నివేదికలు ప్రకారం వెంటనే ప్రణాళికలు వేసి పనులు ప్రారంభించాలన్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులను మంజూరుచేయాలి.. .నెలరోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలని వెల్లడించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వెంట నే పనులు ప్రా రం భ మయ్యేలా చూసుకోవాలి.. ఈలోగా రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు సీఎం జగన్‌ మో హ న్‌ రెడ్డి.  చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలు కావాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌ మో హ న్‌ రెడ్డి.  కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..  104 నంబర్‌ ను బాగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఎవరికైనా ఏదైనా అందక పోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104 కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలి, వారికి సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: