ఒక తొమ్మిదవ తరగతి చదివే మైనర్ బాలిక(15) పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్లింది.ఇక అక్కడ ఆమెపై ప్రిన్సిపాల్ కొడుకు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆ బాలిక ఎవరికీ చెప్పకూడదనీ అతను ఆమెను బెదిరించాడు.ఇక పూర్తి వివరాల్లోకి గనుక వెళ్లినట్లయితే..ఉత్తర్ ప్రదేశ్‌లోని ఈటా ప్రాంతానికి చెందిన దిశ(15, పేరు మార్చబడినది) అనే ఓ బాలిక తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. ఆమె గత వారం పరీక్ష రాసేందుకు తను చదువుకుంటున్న స్కూలుకు వెళ్లింది. పరీక్ష అయిపోగానే అందరూ కూడా ఇంటికి వెళుతుండగా.. ఆ స్కూలులో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు ఆ దిశను ఆపి తరగతి గదిలో ఉన్న కుర్చీని పక్క గదిలోకి తీసుకురమ్మన్నాడు.ఆ ఉపాధ్యాయుడు చెప్పినట్లుగానే దిశ ఒక కుర్చీని పక్క గదిలోకి తీసుకెళ్లింది. ఇక ఆ గదిలోకి వెళ్లగానే దిశ వెనుక నుంచి ఆ ఉపాధ్యాయుడు కూడా వెంటనే వచ్చి గదికి లోపలి నుంచి లాక్ చేశాడు. అది చూసి దిశ ఒక్కసారిగా పాపం భయపడి పోయింది. ఆ తరువాత ఆమె గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ టీచర్ దిశ నోరు మూసి చంపేస్తానని బెదిరించి ఇక ఆమెపై అత్యాచారం చేశాడు.



ఈ విషయం బయట ఎవరికీ చెప్ప కూడదని లేకపోతే మళ్లీ అదే జరుగుతుందని ఆమెను బాగా భయపెట్టాడు.ఇక ఆ ఉపాధ్యాయుడు ఎవరో కాదు ఆ స్కూలు ప్రిన్సిపాల్ కుమారుడు కూడా. దీంతో దిశ పాపం తనకు జరిగిన ఆ ఘటన గురించి బయట ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వణుకుతూ వచ్చిన దిశను చూసి ఆమె తల్లి ఏం జరిగిందని బాగా ఆరా తీసింది. మొదట చెప్పడానికి ఎంతగానో భయపడిన దిశ.. తల్లితో తన బాధ ని చెప్పుకుంది. దిశ చెప్పిన మాటలు విని షాకైన ఆమె తల్లి వెంటనే అక్కడ వున్న పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది.ఇక ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కోసం స్కూలుకు వెళ్లారు. అక్కడ ఆ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తప్పించుకున్నాడని తెలిసి పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: