
ఈ విషయం పైన అటు విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ లో మిగిలిన హామీల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యంగా షర్మిల ఇలా ప్రశ్నిస్తూ.. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యాయి అంటూ విమర్శించింది.. 20 లక్షల ఉద్యోగాలలో ఒకటైన ఇచ్చార? నిరుద్యోగులకు ప్రతినెల 3000 ఇస్తానని చెప్పి ఏ నిరుద్యోగికైనా అందించారా.. 18 ఏళ్ల నిండిన మహిళలకు 1500 రూపాయల చొప్పున ప్రతినెల ఇస్తానని చెప్పారు. ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు.. అన్నదాత సుఖీభవ కింద రూ .20 వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ విషయాన్ని మాట మార్చారు అంటూ షర్మిల విమర్శించారు.
కేంద్రం ఇచ్చేటువంటి 6000 తో లింకు పెట్టి 30 లక్షలు మంది రైతులకు ఎగనామం పెట్టారంటూ ఫైర్ అయ్యింది. తల్లికి వందనం కింద 20 లక్షలు మంది బిడ్డలకు కూడా కోతపెట్టారంటూ ఆరోపణలు చేసింది. 15000 ఇస్తామని చెప్పి 13వేల తోనే సరి పెట్టేశారు అంటూ ఫైర్ అయ్యింది షర్మిల. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత ప్రీ బస్సు అమలు చేసి సూపర్ సిక్స్ హామీలను తానే సక్సెస్ చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఏపీ ప్రజలను ఘోరంగా మోసం చేశారు చంద్రబాబు, అలాగే జనసేన పార్టీలను ట్యాగ్ చేయడం జరిగింది.