సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిజం కంటే అబద్ధం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. అది సినిమా రంగం అయినా, రాజకీయాలు అయినా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా కొన్ని ఫేక్ వార్తలు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కొన్ని క్షణాల పాటు అమరావతి ప్రజల గుండెల్లో వణుకు పుట్టేలా “అమరావతి మునిగిపోయింది”, “విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదు” అంటూ రకరకాల ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో విస్తరించారు. ఇష్టానుసారం తప్పుడు థంబ్‌నెయిల్‌లు పెట్టి ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేశారు.


ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను అరికట్టడమే కాకుండా, వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకురానున్నామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. “కొంతమంది కావాలనే ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోంది. దానిని టార్గెట్ చేసి నెగిటివిటీని సృష్టిస్తున్నారు. తప్పుడు వార్తలు, ఫేక్ థంబ్‌నెయిల్‌లతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇకపై అలాంటి వారెవ్వరైనా సరే కఠిన శిక్ష తప్పదు” అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఫాక్ట్-ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వాస్తవాలు ఏంటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని ఆమె చెప్పారు. ఇకపై ఫేక్ వార్తలు రాసినా, సృష్టించినా, ఫేక్ థంబ్‌నెయిల్‌లు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని " స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు.



రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ..“కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక కొంతమంది సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. ప్రజలకు నిజాలు ఇప్పటికే తెలుసు. వాటిని ఇంకా స్పష్టంగా తెలియజేస్తాం. ఫేక్ పెట్టి మోసం చేయాలని చూస్తే తాటతీస్తాం” అంటూ హెచ్చరించారు. “అసాంఘిక శక్తులను అరికట్టడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని వంగలపూడి అనిత కఠిన హెచ్చరిక జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: