
ఆర్జెడి గత ఎన్నికలలో 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలిచింది. 17 సీట్లు ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిన సీట్లలో మార్జిన్ చాలా ఎక్కువగా ఉంది. బీహార్ లో ఉన్న మొత్తం 243 సీట్లలో పోటీ చేయడానికి తమ సిద్ధంగా ఉన్నాం అని తేజస్వి యాదవ్ ప్రకటించడంతో ఇండి కూటమిలో పరిస్థితి దిగజారిపోయిందని అందరికీ అర్థమైంది. ఇది రాహుల్ గాంధీకి ఇబ్బందికరమే అయినా.. మొహమాట పడకూడదని లాలు కుటుంబం డిసైడ్ అయింది. కాంగ్రెస్ బీహార్ లో ఒంటరిగా పోటీ చేస్తే కనీస సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ ఆర్జెడి ఒత్తిడికి తలొగ్గటం తప్ప మరో మార్గం లేదు. ఇండికూటమిలో కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సీట్ల షేర్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ మిత్రులను దూరం చేసుకుని హర్యానా ఢిల్లీలో ఘోరపరాజయం పాలయ్యింది. బీహార్లో మిత్రులను నిలుపుకోవాలి అంటే ఈ మాత్రం త్యాగాలు తప్పవు.