
శివాజీ మహారాజ్ కేవలం మహారాష్ట్రకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశానికి గర్వకారణమైన పాలకుడని , ఆయన పేరును మార్చడం దురదృష్టకరమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. అలాగే, ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఫడ్నవీస్ నిలదీశారు. ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, శివాజీ మహారాజ్ పేరును యథాతథంగా కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ వివాదంపై ఇంకా స్పందించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సిద్దరామయ్య తానూ తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు