ఇక మీదట సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చేందుకు అంగీకరిస్తేనే టికెట్ల రేటు పెంపు ఆమోదం ఉంటుందంటూ తెలియజేశారు. టికెట్ల రేటు పెరిగితే నిర్మాతలు, హీరోలకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏ విధంగా ఆ ఫలితం దక్కలేదని అందుకే ఇక మీదట టికెట్లు రేపు పెంచే జీవో ఇవ్వాలి అంటే 20% కార్మికులకు ఇవ్వాల్సిందే అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ .10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నామంటూ తెలియజేశారు.
ప్రభుత్వం చేయగలిగిన పనులన్నీ కూడా చేస్తుందని త్వరలోనే సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు సంబంధించి అన్ని ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. సినీ కార్మికుల రూపురేఖలు మార్చేస్తామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత,FDC చైర్మన్ దిల్ రాజ్ తో పాటు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ మరి కొంతమంది మంత్రులు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు కూడా ఆనంద పడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి, ఇందులో భాగంగా సినీ కార్మికుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి