తెలంగాణలో కొత్త పొత్తులు పురుడు పోసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు ఒక్కతాటికపైకి వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు దూరదూరంగా ఉన్నా.... అంతా కలిసి సర్కార్పై సమరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కమ్యూనిస్టులతో కలిసి నడిచేందుకు సైకిల్ పార్టీ నేతలు సై అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి నిరూపిస్తున్నారు.