టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇంట్లో భోషాణం బద్దలైంది. మామూలు భోషాణం కాదిది. సుమారు రూ.90 కోట్ల విలువైన నగదు బయటపడింది. ఇందులో రూ.70 కోట్లు కొత్త నోట్లే కావడం మరింత సంచలనానికి కారణమవుతోంది. నగదుతో పాటు సుమారు వంద కిలోల బంగారు ఆభరణాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తమిళనాడులో ఇసుక, మైనింగ్, కన్ స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న శేఖర్ రెడ్డి బడా పారిశ్రామిక వేత్తగా పేరొందారు. అధికార అన్నాడీఎంకే పార్టీకి అత్యంత సన్నిహితుడు. జయలలిత సిఫారసు మేరకే ఏపీ సీఎం చంద్రబాబు.. శేఖర్ రెడ్డిని పాలకమండలిల