ఈ మద్య కొంత మంది సైకోలు చేస్తున్న పనులు వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. విచక్షణా రహితంగా వారు చేస్తున్న ఉన్మాదానికి అమాయకులు బలి అవుతున్నారు. తాజాగా జార్ఖండ్ లోని జమ్ షడ్ పూర్ లో ఓ వ్యక్తి సేరేకేలా-కర్శ్యాన్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేయగా, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..నసిక వికలాంగుడైన హరీ హెంబ్రామ్ అనే వ్యక్తి, సేరైకేలాలోని ఖప్రసాయ్ ప్రైమరీ స్కూల్ వద్దకు మధ్యాహ్న భోజన సమయంలో వెళ్లి, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని బయటకు పిలిచాడు.
ఉన్నట్టుండి ఆమెపై పదునైన కత్తితో దాడి చేసి తల నరికాడు..ఆపై తలను చేత్తో పట్టుకుని పరుగు లంఘించుకున్నాడు. అతన్ని స్థానికులు తరుముతుండగా, పోలీసులకు సమాచారం వెళ్లింది. స్థానికులు అతన్ని కొట్టి చంపేందుకు ప్రయత్నించిన క్రమంలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. మృతురాలిని సుక్రా హేసా (30)గా గుర్తించామని తెలిపారు.
కాగా, ఆ ఉన్మాది చేతిలో కత్తి ఉండటంతో అతడిని ఎవరూ పట్టుకోవడానికి ప్రయత్నించలేదని మరో అధికారి తెలిపారు. సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోని పొదల్లో దాకున్నాడని గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. అతడిని పట్టుకోవడానికి సుమారు 2 గంటల పాటు శ్రమించామన్నారు పోలీసులు. స్థానిక ప్రజలు అతనిపై దాడికి దిగబోగా, వారిని అడ్డుకోవడం క్లిష్టతరమైందని అన్నారు. అనంతరం అతడిని జంషెడ్పూర్లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.