రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ఫుల్ జోష్ లో ఉన్నది.. పార్టీ నాయకులు అధినేతలు ప్రస్తుతం ప్రచారంలో హోరెత్తిస్తూ ఉన్నారు.. తాజాగా హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైనా పోటీ చేస్తే.. ప్రచారం ఎక్కువగా ఉంటాది పని తక్కువగా ఉంటుందనీ చెబుతూ ఉంటారు.. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ కూడా ఓటమి మాత్రమే జరుగుతూ ఉంటుంది.. కానీ సెకండ్ ప్లేస్ లో మాత్రం బిజెపి పార్టీని కనిపిస్తూ ఉంటుంది.. కానీ మాధవి లత మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ప్రజల మనసు గెలుచుకుంటోంది. మరి నిజంగా గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఆమె గురించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


ఎందుకంటే.. ఓవైసీ జీవితంలో ఎవరి వల్ల కానటువంటి దాన్ని ఆవిడ జయించింది.. మొట్టమొదటి విజయం.. ముఖ్యంగా సిటీలలో మత పిచ్చి చాలా ఎక్కువగానే ఉంటుంది.. హైదరాబాదులో మాధవి లతా దెబ్బకు ఓవైసీ కూడా భయపడేలా చేస్తోంది.. ముఖ్యంగా హిందువు పూజరీ దగ్గరికి  ఓవైసీ ని పంపించినటువంటి ఘనత మాత్రం మాధవి లతాకి దక్కింది... తాజాగా ఓవైసీ ని ఒక గుడికి వెళ్లి పూజ చేయించి దండ మెడలో  వేసుకున్నటు వంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.



అంటే మొట్టమొదటిసారి గెలుపు భయాన్ని ఓవైసీ లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.. తద్వారా సగం గెలిచిందని కూడా చెప్పవచ్చు.. పూర్తిగా గెలుస్తారా లేదా అనే విషయం తెలియదు కానీ.. దేశవ్యాప్తంగా మాధవి లత పేరు మాత్రం చాలా ఎక్కువగానే వినిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం మాధవి లత అని అభినందించాలి.. బిజెపి పార్టీ అన్ని ప్రాంతాలలో కూడా తమ బాగా వేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే ఇప్పటివరకు చేస్తోంది.అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను కూడా చేస్తూ ముందుకు వెళుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమిలో భాగంగా చాలామంది అభ్యర్థులను కూడా పోటీ చేయిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: