రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా కనిపించనుండగా ... బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితాబచ్చన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. ఇకపోతే ప్రభాస్ ఈ మూ వీలో హీరోగా నటిస్తూ ఉండడం , మహానటి లాంటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం , ఇందులో కమల్ హాసన్ విలన్ గా నటించడం , అమితాబచ్చన్ కీలకపాత్రలో నటించడంతో ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి ఏకంగా 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఇది కనక నిజం అయినట్లు అయితే ఇది అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పవచ్చు. కాకపోతే ఈ రేంజ్ షేర్ కలక్షన్ లను వెనక్కు రాబట్టాలి అంటే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండాల్సి ఉంటుంది. మరి కల్కి మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: