దీంతో దాదాపుగా రెండు గంటల పాటు ఇరువురి వర్గాల మధ్య చాలా ఘర్షణ చోటు చేసుకుందట. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి.. ఇద్దరు కూడా ప్రసాద్ కార్యాలయానికి వెళ్లారు.ఈ సమయంలోనే చౌదరి వర్గీయులను ప్రసాద్ కార్యాలయంలోకి రాకుండా టిడిపి నాయకుడు సుధాకర్ నాయుడు, చంద్రదండుప్రకాష్ అడ్డుకోవడం జరిగింది. దీంతో అటు చౌదరి వర్గీయులు ఒకసారిగా తొసుకుంటూ లోపలికి బలంగా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన సరైన ఫలితం లగ్గించలేదు.
ఒకరిపై ఒకరు అసభ్య పదజాలతో దూషించడంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని రెండు వర్గీయులను అక్కడి నుంచి పంపించేశారు.. ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపిలో ఇలా విభేదాలు ఒక్కసారిగా బగ్గుమనడంతో ఆ పార్టీ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు పర్యటనను విజయం చేయడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇలా చేస్తే ఎలా అంటూ పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు. అయితే గొడవ ముగిసీన కొద్దిసేపటికి ఎమ్మెల్యే చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని టిడిపి గెలుపు కోసమే ఈ బహిరంగ సభను నిర్వహించబోతున్నామంటూ తెలిపారు. ఈ సభని టిడిపి జనసేన బిజెపి నాయకులు విజయవంతం చేయాలంటూ కోరారు.