ఇటీవలె స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది ప్రస్తుతం టీమిండియా.  టి20 సిరీస్ లో భాగంగా నిన్న మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఇక ఈ టి 20 మ్యాచ్ లో మొదట న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఇక భారీ చేదన కోసం బరిలోకి దిగిన టీమిండియా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ముందుగా ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకే  వికెట్ కోల్పోయాడు. కానీ ఆ తర్వాత మూడవ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు అనే చెప్పాలి.



 దీంతో ఇక ఇద్దరు ఆటగాళ్ళు కూడా న్యూజిలాండ్ బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ అనుకున్నంత స్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు. భారీగా పరుగులు చేస్తాడు అనుకున్నప్పటికీ కేవలం 17 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. అయితే నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే నిన్న జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఒక అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ జెర్సీ నెంబర్ 17 అన్న విషయం తెలిసిందే.


నిన్న తేదీ కూడా 17 కావడం గమనార్హం. అదే సమయంలో నిన్న జరిగిన టీ-20 మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడింది 17 బంతులు మాత్రమేఇక 17 బంతులలో రిషబ్ పంత్ చేసింది 17 పరుగులే. ఇలా పూర్తిగా 17 కే పరిమితం అయ్యాడు రిషబ్ పంత్. ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 17వ తేదీ రోజు జరిగిన టి20 మ్యాచ్ లో 17వ నెంబర్ జెర్సీ  కలిగిన ఆటగాడు 17 బంతులు ఆడి  17 పరుగులు చేశాడు అంటూ ప్రస్తుతం టీమిండియా ఫాన్స్ అందరు సోషల్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇలాంటి పోస్టులు కాస్త వైరల్ గా మారిపోతున్నాయి. కాగా చివరిలో ఫోర్ కొట్టిన రిషబ్ పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: