దీంతో ఇక ఇద్దరు ఆటగాళ్ళు కూడా న్యూజిలాండ్ బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ అనుకున్నంత స్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు. భారీగా పరుగులు చేస్తాడు అనుకున్నప్పటికీ కేవలం 17 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. అయితే నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే నిన్న జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఒక అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ జెర్సీ నెంబర్ 17 అన్న విషయం తెలిసిందే.
నిన్న తేదీ కూడా 17 కావడం గమనార్హం. అదే సమయంలో నిన్న జరిగిన టీ-20 మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడింది 17 బంతులు మాత్రమేఇక 17 బంతులలో రిషబ్ పంత్ చేసింది 17 పరుగులే. ఇలా పూర్తిగా 17 కే పరిమితం అయ్యాడు రిషబ్ పంత్. ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 17వ తేదీ రోజు జరిగిన టి20 మ్యాచ్ లో 17వ నెంబర్ జెర్సీ కలిగిన ఆటగాడు 17 బంతులు ఆడి 17 పరుగులు చేశాడు అంటూ ప్రస్తుతం టీమిండియా ఫాన్స్ అందరు సోషల్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇలాంటి పోస్టులు కాస్త వైరల్ గా మారిపోతున్నాయి. కాగా చివరిలో ఫోర్ కొట్టిన రిషబ్ పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు.