అయితే సాధారణంగా మహేంద్ర సింగ్ ధోనీ అటు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. కానీ ధోనీ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు పెడితే యాక్టివ్గానే ఉంటారూ అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ధోని కూడా తన అభిమానులకు అంతే గౌరవం ఇస్తూ సర్ప్రైస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా అభిమానులందరినీ సంతోషపెట్టడానికి ఏదో ఒకటి కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటారు మహేంద్రసింగ్ ధోని.
ఇది ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. ఒక అభిమాని మహేంద్ర సింగ్ ధోని పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ దానిని అక్షర రూపం లో మార్చి ఒక లేఖను రాశాడు. ఎంతో కష్టపడి అది ధోని కి చేరేలా చేశాడు. అభిమాని రాసిన లేఖను చదివి ఎంతగానో సంతోష పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో అద్భుతంగా లేఖరాశావ్ అంటూ మెచ్చుకున్నాడు. అంతే కాదు ఆ లేఖపై సంతకం కూడా పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆ లేఖను ఫ్రేమ్ గా పెట్టి ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.