అయితే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తూ విజయాలు సాధించడంపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గుజరాత్ తొలి తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిది విజయాలు సాధించి తిరుగులేని విధంగా ముందుకు సాగింది. కానీ చివరి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే గుజరాతి 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఏ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించిన అటు అధికారికంగా గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ జట్టు ఆటతీరుపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతు.. గుజరాత్ టైటాన్స్ భయం లేకుండా అద్భుతంగా ఆడుతున్నారు. ఫలితం గురించి పెద్దగా ఆలోచించకుండా ఆటను కొనసాగిస్తున్నారు. తమ తీరు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అని భయం వారిలో ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఆ జట్టు విజయం సాధించగలుగుతూ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్. ఫలితం గురించి ఆలోచించకుండా అందరూ ఆటగాళ్లు ఎంతో పాజిటివ్ క్రికెట్ ఆడుతున్నారు అని ప్రశంసించాడు.