సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా 2 టీ20 మ్యాచ్లు ఆడింది ఇండియా. 2  టీ20 మ్యాచ్ లలో కూడా ఓటమి చవి చూసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రెండవ టీ 20 మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్లో అదిరిపోయే హిట్టర్ గా  పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ కంటే ముందు ఆల్రౌండర్ అక్షర్ పటేల్  బ్యాటింగ్ కి రావడం అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే ఇలా దినేష్ కార్తిక్ ని కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ కు దింపడంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. క్రికెట్ ప్రేక్షకులు అందరు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు.



 అప్పటికే టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో దినేష్ కార్తీక్ లాంటి హిట్టర్ ను బ్యాటింగ్  కి పంపకుండా అక్షర్ పటేల్ ను పంపడం  ఏంటి అంటు విమర్శలు గుప్పించారు ప్రేక్షకులు. అయితే ఇలా దినేష్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్ ని బ్యాటింగ్ కు పంపడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ స్పందించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకు తాము ముందుగానే నిర్ణయం తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చే సమయంలో ఏడు ఓవర్లు మిగిలి ఉన్నాయి.


 ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రోటేట్ చేయగల ఆటగాడు కావాలని అనుకున్నాం. అంతేకానీ ఇక క్రీజు లోకి రావడం రావడమే ఎడాపెడా సిక్సర్లు కొట్టే ఆటగాడు వద్దు అని అనుకున్నాం.. అందుకే అక్షర్ పటేల్ ని ముందుగా పంపించాము అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ రెండవ టీ 20 మ్యాచ్లో  క్రీజులోకి వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది పడ్డాడు. కాగా సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇండియా  తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: