
పంత్ చేసిన తప్పు ఏమిటంటే ? ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే .. రిషబ్ పంత్ మందులించబడిన ఆ తప్పును ఎప్పుడు చేశాడా అని . ఇక ఈ ఘటన లీడ్స్ టెస్ట్ మూడో రోజున చోటుచేసుకుంది .. మొదటి ఇన్నింగ్స్ 61 వ ఓవర్ లో .. బాల్ ఆకారం మారిందని, దాన్ని మార్చాలని ఫీల్డ్ ఎంపైర్ ని కోరాడు .. అయితే ఎంపైర్ బాల్ ని తనిఖీ చేసి కొత్త బంతిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు . ఇక దాంతో కోపానికి గురైన పంత్ .. ఎంపైర్ చేతిలోని బాల్ ని తీసుకుంటూ అతనితో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు .. అంతేకాకుండా కోపంతో బాల్ ని నేలపై విసిరాడు .. ఇలా ఐసీసీ నిబంధన ప్రకారం ఎంపైర్ తో ఒక ఆటగాడు ఇలా ప్రవర్తించడం కఠినమైన నేరం అందుకే పంత్ను ఐసీసీ మందలించింది ..
మ్యాచ్ రిఫరీ ముందు తన తప్పును ఒప్పుకున్న పంత్ : ఐసీసీ పత్రిక ప్రకటన ప్రకారం .. రిషబ్ పంత్ తన తప్పును మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ముందు ఒప్పుకున్నాడు .. ఇక దీంతో అతను పై తదుపరి విచారణ పనిలేకుండా పోయింది . ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రైఫిల్ , క్రిస్ జాఫ్నీ, మైదానంలో పంత్ ప్రవర్తన పై మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ చేశారు .. ఇక వీరందరితో పాటు థర్డ్ ఎంపైర్షర్ఫుదుల్లా, నాలుగవ ఎంపైర్ అంపైర్ మైక్ బర్న్స్ ఈ ఆరోపణలే చేశారు .. ఇక దీంతో లెవెల్ వన్ కింద దోషులుగా నిరుపేతలైన ఆటగాళ్లకు కనీస శిక్ష మందలింపు .. గరిష్ట శిక్ష వారి మ్యాచ్ ఫీజులో 50% కోత .. లేదా రెండు డీమెరిట్ పాయింట్లు వారి ఖాతాలో జోడించడం ..