జియో ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా తన టారిఫ్లను కూడా పెంచిన సంగతి తెలిసిందే. టారిఫ్ రేట్లు అయితే పెంచిందికానీ తన కస్టమర్లకు మాత్రం ఊరటనిస్తూ మరో ఆల్ ఇన్ వన్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఇవన్నీ ఇలా ఉండే.. జియో అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల చేసింది.
ఎస్ సిరీస్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 19,990 ధర వద్ద శనివారంనుంచి వివోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది. అలాగే వివో ఇండియా తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. వివో ఎస్1 ప్రొ 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 665 సాక్, 8 జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహచ్ బ్యాటరీతో అమర్చింది. లాంచింగ్ ఆఫర్లను చూస్తే.. జనవరి 31 వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్, ఐసీఐసీఐ క్రెడిట్కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్బ్యాక్, జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్ చేసింది.