బజాజ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల ఎలెక్ట్రానిక్ వస్తువులను, ఆటో మొబైల్ వాహనాల ను మార్కెట్ లోకి విడుదల చేశారు. దీంతో ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల మరో బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. విపణిలోకి సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్‌ స్టార్ట్ మోటారు బైక్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 'కంఫర్టెక్ టెక్నాలజీ'తో వస్తున్నఈ ప్లాటినా బ్రాండ్‌ బైక్‌ లో అధునాతన ఫీచర్లను చేర్చారు.


దూర ప్రయాణానికి అనువుగా ఉండేలా స్ప్రింగ్‌- ఇన్‌- స్ర్పింగ్‌ సస్పెన్షన్‌ వ్యవస్థ కూడా ఇందులో అందు బాటులో ఉంది. ప్లాటినాలో తొలిసారి ట్యూబ్‌లెస్ టైర్లు మాత్రమే అమర్చారు.ఈ బైక్ ప్రత్యేకతలు విషయానికొస్తే..102 సీసీ, ఫోర్‌ స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్ కల ఈ బైక్‌ 7,500 ఆర్‌పీఎం వద్ద 7.9 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. అలాగే 5,500 ఆర్‌పీఎం వద్ద 8.34 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాక్‌టెయిల్‌ వైన్‌ రెడ్‌, ఎబోనీ బ్లాక్ రంగుల్లో ఈ బైక్ మార్కెట్ లో ఉంది.


భారత దేశంలో ఈ బజాజ్ కంపెనీ కి మంచి క్రేజ్ ఉంది. దేశవ్యాప్తం గా అన్ని బజాజ్‌ ఆటో షోరూంల లో అందుబాటు లో ఉండనుంది. దీని ధర రూ.53,920గా బజాజ్ ఆటో నిర్ణయించింది. బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందర్ రామణన్ స్పందిస్తూ ప్లాటినా బ్రాండ్‌.. ఇప్పటివరకు 70 లక్షల మంది వినియోగదారులను సంతోష పరిచిందన్నారు... బజాజ్ రానున్న రోజుల్లో ఎలెక్ట్రానిక్ వాహనాలను తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉగాదికి మరో కొత్త ఫీచర్ల తో బైక్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలిపారు.. ఆ కొత్త బైక్ యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..మొత్తానికి ఈ కంపెనీ సరికొత్త నిర్ణయాలతో దుసుపోతుందిబజాజ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల ఎలెక్ట్రానిక్ వస్తువులను, ఆటో మొబైల్ వాహనాల ను మార్కెట్ లోకి విడుదల చేశారు. దీంతో ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల మరో బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. విపణిలోకి సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్‌ స్టార్ట్ మోటారు బైక్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 'కంఫర్టెక్ టెక్నాలజీ'తో వస్తున్నఈ ప్లాటినా బ్రాండ్‌ బైక్‌ లో అధునాతన ఫీచర్లను చేర్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: