గౌతమ్ అదానీ.. ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుడుగా గుర్తింపు పొందుతున్నారు. తక్కువ కాలంలో వేగంగా ధనికుడు అయిన వ్యాపారవేత్తగా ఆయన మారుతున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా రెండో స్థానానికి దూసుకుపోయారు. ఇప్పుడు ఆయన దేశీయంగానూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. అనేక కొత్త రంగాలకు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.

తాజాగా ఆయన సిమెంట్ రంగంలోనూ అడుగు పెట్టారు. అంతకు ముందు అదానీకి ఈ రంగంలో పెట్టుబడులే లేవు.. ఇప్పుడు ఈ రంగంలో పేరున్న అంబుజా, ఏసీసీ సిమెంట్స్ సంస్థల్లో వాటాలు కొన్నారు. ఈ ప్రక్రియను  పూర్తి కావడంతో ఇప్పుడు అదానీ  దేశంలోనే  రెండో అతి పెద్ద సిమెంట్ తయారీదారుగా మారారు. ఇప్పుడు గౌతమ్ అదానీకి అంబుజా సిమెంట్స్ లో 63.1 శాతం వాటా ఉంది. అలాగే ఏసీసీ లిమిటెడ్ లో  54.5 శాతం వాటా దక్కించుకున్నారు. అయితే ఆయన ఇటీవల తన కీలక వ్యాపారాలైన పోర్టులు, రియల్ ఎస్టేట్  వంటి ఇతర వ్యాపారాల అవసరాలకు కూడా ఈ  సిమెంట్ సంస్థలు బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: