చాలా మంది ముఖం అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే పదార్థాలను ఉపయోగిస్తారు. దీనితో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మెుటిమలతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. మార్కెట్లో దొరికే వాటితో కాకుండా కొన్ని సహజ పదార్థాలను మీ ముఖానికి ఉపయోగిస్తే మంచిది.ఆరెంజ్ జ్యూస్‌తో 2 టేబుల్‌స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్‌లా తయారు చేసి దీన్ని మీ ముఖంపై 30 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. మంచి ఫలితాల కోసం, ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు వాడండి, ట్యానింగ్ సమస్యల నుండి బయటపడండి.పొడి చర్మానికి అరటిపండు కూడా ఒక గొప్ప ఎంపిక. పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో పాలు లేదా రోజ్ వాటర్ కలపాలి. ఆ తర్వాత శెనగపిండి వేయాలి. కాసేపు బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయండి.గ్రీన్ టీ బ్యాగ్‌ని వేడి నీళ్లలో నానబెట్టి, చల్లారగానే శెనగపిండిని వేయాలి.


ఈ మిశ్రమాన్ని ముఖానికి 15 నిమిషాలు పట్టించి, ఆపై నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని అందంగా మారేందుకు సహాయపడుతుంది.2 టేబుల్ స్పూన్ల శెనగపిండి, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, పెరుగు అవసరాన్ని బట్టి తీసుకోండి. వాటిని బాగా కలపండి. మీ ముఖానికి 20 నిమిషాల పాటు ప్యాక్ వేయండి. కడిగిన తర్వాత, మాయిశ్చరైజర్ రాయండి. ఈ ప్యాక్ డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.టొమాటో రసంలో 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ ముఖంపై 10 నిమిషాలు అప్లై చేయండి. ఆపై కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, ఇతర యాంటీ ఏజింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. టొమాటో రసం మీ స్కిన్ అందంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న కాసేపటికి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా శెనగపిండిలో ఈ పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: