బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అక్షయ్ కుమార్ కు సమీప బంధువు అయిన సచిన్ కుమార్ నిన్న రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. అక్షయ్ కుమార్ కు ఆయన అత్యంత సమీప బంధువు. ఈ నెల 13న సచిన్ పుట్టిన రోజు కూడా జరుపుకున్నారు. అలాంటి వ్యక్తికి సడెన్గా గుండె పోటు రావడంతో హాస్పటల్కు తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. సచిన్ మృతదేహం చూసిన అక్షయ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవ్వడంతో పాటు కన్నీరు కూడా పెట్టుకున్నారు. సచిన్ మరణం పట్ల బాలీవుడ్ పలువురు బాలీవుడ్ ప్రుముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైయ్యారు. ఏక్తా కపూర్ నిర్మించిన ‘కహానీ ఘర్ ఘర్ కీ’ సినిమాలో సచిన్ కుమార్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఫోటో గ్రాఫర్గా మారి నటనకు గుడ్ బై చెప్పారు.