దేశంలో ఇప్పుడు కరోనా భయంతో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆగిపోయాయి. ఇక రావాణా వ్యవస్థ స్థంభించిన పోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది.  ఇక రోజూ జరిగే క్రైమ్ రేటు కూడా తగ్గిందని అంటున్నారు తెలుగు రాష్ట్ర పోలీసులు.  కానీ అక్కడక్కడ అత్యాచారాలు, హత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా యువకుడి తలను శరీరంనుంచి వేరుచేసి, చేతి వేళ్లను నరికి అతి క్రూరంగా చంపేశారు గుర్తు తెలియని కొందరు.  ఈ సమయంలో ఇంత ఘోరంగా ఓ వ్యక్తిని చంపడి సంచలనం రేపుతుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పుర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెల్లవారి అందరికీ తెలిసిందే.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫతేహ్‌పుర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ అనే 22 ఏళ్ల  యువకుడు ఆదివారం 12 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. 2:30 గంటల ప్రాంతంలో తల వేరు చేయబడ్డ అతడి శవాన్ని అటుగా వెళుతున్న కొందరు గుర్తించారు. 

 

ఆ చిద్రమైన శరీరాన్ని చూసి మొదట భయంతో వణికిపోయారు.  ఆ వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కుడి చేతి వేళ్లను మూడింటిని తొలగించి ఉండటం గమనించారు.  ఆ తల నరికి పక్కనే ఇటుకలపై పెట్టి ఉంచారు. అయితే ప్రమోద్ సెల్ కూడా కనిపించడకుండా పోవడంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి.  ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: