టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పూర్తిగా కోలుకున్నారు అని అధికారులు ప్రకటించారు. ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. కాసేపట్లో ఆయనను విజయవాడ సబ్ జైలుకి ఏసీబీ అధికారులు తరలిస్తారు.  ఈ నేపధ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. 

 

ఆయన పూర్తిగా కోలుకున్నారు అని రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. టీడీపీ కార్యకర్తలు నేతలు విజయవాడ సబ్ జైలుకి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీనితో ఏ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను అవసరం అయితే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: