అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎన్నికల కోసం పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సజ్జనార్ తెలిపారు. మొత్తం 13,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ఒక రోజు మాత్రమే సమయం ఉండటంతో పలు పార్టీల నాయకులు గానీ,కార్యకర్తలు గాని ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభపెట్టే వారికిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇంతవరకు నగరాన్ని ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఇక పోలింగ్ కోసం ఎదురు చూడనున్నాయి. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి గ్రేటర్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా బల్దియా పీఠాన్ని అధిరోహించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ మరొకసారి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవాలని అని గట్టి ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ తెలుగుదేశం వంటి పార్టీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి బల్దియా పీఠాన్ని అధిరోహించే ఆ పార్టీ ఏదో అవుతుందో చూడాలి.