జైల్లో
దేవినేని ఉమా ప్రాణాలకు ముప్పు ఉందంటూ
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాజాగా
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావును ఆకస్మికంగా నెల్లూరు జైలు శాఖ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్ గా బదిలీ చేయడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2015 నుంచి
రాజమండ్రి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆయనను
దేవినేని ఉమా జైల్లో ఉన్న నేపథ్యంలో బదిలీ చేయడంపై
తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. జైల్లో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తన రావడానికి ఎంతో కృషి చేసిన రాజారావును బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమాాపై కక్షతోనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని, ఇంతకు ముందు రాజకీయ ప్రత్యర్థులను జైల్లో చంపిన
చరిత్ర వైసీపీకి ఉందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఉమ ప్రాణాలకు ఎలాంటి హాని కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇక
రాజమండ్రి సెంట్రల్ జైలు కొత్త సూపరింటెండెంట్ గా నెల్లూరు జైలు శాఖ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్
కిషోర్ కుమార్ ను నియమించారు.