ఈ పరిణామంపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ స్పందించారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు ఆవేదనను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు తన భార్యను కించపరిచారని కంట తడి పెట్టారని, ఆయన కంట తడి పెట్టడం చాలా బాధ కలిగించిందని వెల్లడించారు. కుటుంబ సభ్యులను కించపరచడం తగదన్నారు పవన్కళ్యాణ్. రాష్ట్రంలో వరదలు విజృంభిస్తుంటే.. వరదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఒకరినొకరు విమర్శించుకోవడం దురదృష్టకరం అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి