తెలంగాణ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందన్న  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక.. మిగులు బడ్జెట్ కాస్తా లోటు బడ్జెట్ అయిందని.. బడ్జెట్ అప్రూవల్  కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారని  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఆరోపించారు.


బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని.. బడ్జెట్ లో చాల అప్పులు చూపించడం లేదని.. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రంకు ఉందని  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై 1 .25 లక్షల అప్పు ఉందన్న  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. ఎఫ్ఆర్బియం లిమిట్ ను తెలంగాణ దాటిపోతోందన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండని కేసీఆర్‌కు సవాల్ విసిరిన  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. లిక్కర్ స్కామ్ పై  ఎవరి పై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: