పారిశ్రామిక రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను  కంట తడిపెట్టడానికి ఓ చిన్న పిల్లోడు కారణయాడంటే నమ్మడలేదు కాదు. మీకే కాదు నాకు కూడా మీకొచ్చిన సందేహమే వచ్చిందండయో.. కానీ నిదానంగా పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. నిత్యం వ్యాపార రంగంలో ఎదురైయే ఎటువంటి సవాళ్లనైనా సరే సమర్ధవంతంగా ఎదుర్కోగల  వ్యాపార దిట్ట మహేంద్ర. అలాంటి వ్యాపారవేత్త  ఎలాంటి లోపాలు, సవాళ్లను బహుమతిగా భావించాలన్నారు.



జీవితం మనకో బహుమతి. దానిని అందంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. ఇలాంటి దృశ్యాలు నాలో ఆశావాహ దృక్పథాన్ని పెంచుతాయి’ అంటూ ట్వీట్‌లో వెల్లడించారు మహీంద్రా. ఈ మధ్యే నా మనవడిని చూశా. కానీ కాలితో ఓ చెంచా మధ్యలో చెంచా ఉంచుకుని..ఆహారం నోట్లో వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్న ఓ చిన్న పిల్లోడు పడుతున్న తంటాలను  చూడగానే కన్నీళ్లు ఆపులేకపోయానన్నారు. ఈ దృశ్యాలను  వాట్సప్‌లో చూసిన ఆ బిజినెస్ టైక్యూన్ తీవ్రంగా స్పందించారు.  ఓ చిన్న పిల్లవాడు..రెండు చేతులు లేవు..ఆహారం తినడానికి అష్టకష్టాలు పడుతున్నాడు.



కొద్దిసేపటికి కొద్ది ఆహారం నోట్లో పడింది...కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వీడియో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాసేపటికే ఈ వీడియో వైరల్ అయ్యింది. మొత్తం 17 సెకన్ల నిడివి ఉంది. వైకల్యం శరీరానికి కానీ..మనస్సుకు కాదు..అని నిరూపించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అసాధారణ ప్రతిభతో తమేంటో రుజువు చేసుకున్నారు. రెండు చేతులు పుట్టిన చంటోడు..ఎవరి అవసరం లేకుండా..ఆహారాన్ని తనకు తానుగా తీసుకోవడం అందరినీ కదిలిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: