ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడా ఉల్లంఘించలేదని మా చందాదారులందరికీ మార్గదర్శి హామీ ఇస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్కు అనుగుణంగా కంపెనీ తన వ్యాపారాన్ని చాలా నిబద్దతతో నిర్వహిస్తోందన్న మార్గదర్శి సంస్థ... మా ఆర్థిక క్రమశిక్షణే మా బలం, మేము ఎప్పుడైనా ఏ విషయంలోనూ చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించ లేదని స్పష్టం చేసింది.
చిట్ ఫండ్ కంపెనీలో సభ్యునిగా నిర్ధారణ అయ్యాక కూడా మా చందాదారులందరినీ భయాందోళనలకు గురిచేయడానికి ఏపీ సీఐడీ ప్రయత్నిస్తోందని.. వారి వ్యక్తిగత వివరాల కోసం పట్టుబట్టి వేధించడానికి, మార్గదర్శి వ్యాపారాన్ని దాని కస్టమర్ నెట్వర్క్ను దెబ్బతీసే దురుద్దేశాలతో విచారణలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. కంపెనీలో చందాదారునిగా ధృవీకరించిన తర్వాత కూడా గౌరవనీయ తెలంగాణ హైకోర్టు రిట్ పిటీషన్ WP 45189/2022లో జారీ చేసిన ఉత్తర్వులో చందాదారుల గోప్యతలో జోక్యం చేసుకోకూడదని సీఐడీకి సూచించిందని గుర్తు చేసింది.
కానీ తమ చందాదారుల గోప్యత విషయంలో కోర్టు వారి నిర్లక్ష్యపెట్టిన ఏపీ సీఐడీ కోర్టు దిక్కారానికి పాల్పడిందని మార్గదర్శి అంటోంది. ఈ విషయంలో గౌరవనీయ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తోందని.. తన కస్టమర్లందరినీ వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి