వైఎస్సార్ కు ఏ స్ధాయిలో అభిమానులు, మద్దుతుదారులుంటే నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది ? సరిగ్గా ఈ పాయింట్ మీదే షర్మిల దృష్టిపెట్టింది. అందుకనే తన రాజకీయ పార్టీ ఏర్పాటు, ప్రస్ధానాన్ని ఖమ్మం జిల్లాతోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లుంది. షర్మిల ఆలోచనలకు తోడు ఖమ్మంలోని కొందరు నేతలు కూడా ఇదే విషయాన్ని పట్టుబట్టారు. దాంతో ఏప్రిల్ 9వ తేదీన లక్షమందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని దాదాపు డిసైడ్ అయినట్లే. ఆ బహిరంగసభలోనే పార్టీ ఏర్పాటు, జెండా, అజెండా మొత్తాన్ని జనాల మధ్యలో ప్రకటించేందుకు రంగం రెడీ అవుతోంది.
ఇఫ్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ఖమ్మం జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో మాత్రం రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అంటే చాలా జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లాకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. షర్మిల దృష్టి ఎక్కువగా ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పైనే ఎక్కువగా ఫోకస్ అయ్యిందని సమాచారం. వీటిల్లో కూడా ఖమ్మం, నిజామాబాద్, కరీనంగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంద్రులు కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వ్యూహాత్మకంగా తెలంగాణాలో ఉంటున్న వైసీపీ అభిమానులను కూడా ఆకట్టుకునేందుకే షర్మిల పావులు కదుపుతున్నట్లు సమాచారం. చూద్దాం ఏప్రిల్ 9వ తేదీ ఏమి జరుగుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి