2021 ఏడాది చివరి 3 నెలల్లో బ్రిటన్ ను భారత్ వెనక్కి నెట్టేసింది. బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఓ పక్క బ్రిటన్లో జీవన వ్యయం భారీగా పెరిగిపోతోంది. మరో వైపు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పడిపోతోంది. దీంతో ఇవన్నీ బ్రిటన్ ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది మెుదటి త్రైమాసికం జీడీపీలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ లెక్కలు చెబుతున్నాయి. గత 4 దశాబ్దాల్లో బ్రిటన్ లో వేగంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతూ వస్తోంది. ఈ ట్రెండ్ 2024 వరకు కొనసాగవచ్చని ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది.
బ్రిటన్ పరిస్థితి ఇలా ఉంటే.. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ త్రైమాసికంలో చైనా తర్వాత భారతీయ స్టాక్ లు పుంజుకోవడం కూడా మరో సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. గత త్రైమాసికం చివరి రోజు.డాలర్ మారకపు విలువ ఆధారంగా...ఐఎంఎఫ్ , బ్లూమ్ బర్గ్ సంస్థలు అంచనా వేసిన లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లుకు పెరిగింది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 816 బిలియన్ డాలర్లుకు పడిపోయింది.
అంతే కాదు.. భారత కరెన్సీతో పోలిస్తే ఈ ఏడాది బ్రిటన్ పౌండ్ విలువ 8 శాతం పడిపోయింది. తాజాగా ప్రపంచం టాప్ 5 లెక్కలు చూస్తే.. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఫస్ట్ 4 స్థానాల్లో ఉండగా.. భారత్ ఐదో ప్లేసుకు చేరుకుంది. అయితే.. 2029 నాటికి ఇండియా జర్మనీ, జపాన్లను కూడా అధిగమించి టాప్ 3 ప్లేస్కు చేరుతుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి