
ఈ క్రమంలోనే అణు ఆయువులను ప్రయోగించే అంశాన్ని చర్చించినా చర్చింవచ్చని తెలుస్తోంది. యుద్ధం ఆగినట్టు ఉన్నా పాక్ను నమ్మలేం. ప్రస్తుతం భారత్ తో పాటు పాక్ వద్ద వందలోపు అణు బాంబులు ఉన్నాయి. ఒకవేళ అణు యుద్ధం అంటూ జరిగితే మొదటి దశలోనే దాదాపు రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. చాలామంది రెడీయేషన్ ప్రభావానికి లోనవుతారు. లక్షలాదిమంది అణు బాంబు ధాటికి కాలిపోతారు. ముఖ్యంగా భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర దెబ్బతింటుంది. నల్లని పొగ ఆకాశాన్ని కమ్మడంతో సూర్యరశ్మి భూమిని చేరదు.. దాంతో చలి విపరీతంగా పెరుగుతుంది. ఆహారం కోసం అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. హిరోషిమా పై అణుబాంబు వేయడం జరిగి 74 సంవత్సరాలు అయినా ఇప్పటికే అక్కడ పుట్టే పిల్లల్లో రెడీయేషన్ ప్రభావం కనిపిస్తూనే ఉంది.
ఇక భారత వద్ద అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అణునుబంబులు ఉన్నాయి. పాక్ వద్ద కూడా ఉన్నాయి.. వీటిలో ఒకటి రెండు వాడిన ఆ బీభత్సం ఊహించలేనిదిగా ఉంటుంది అని ... యుద్ధం జరిగితే లక్షలాది మంది క్షణాల్లో బూడిద అవడం ఖాయం. 100 కిలోమీటర్ల వరకు ఇళ్ల అద్దాలు పగిలిపోతాయి. చాలా జీవులు అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. ఇది రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు ..అమెరికా వంటి దూరప్రాంతాలలో కూడా పంటలు పండవు. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కోసం అలజడి రేగుతుంది. భారత బాధ్యతాయుతమైన దేశం అందువల్ల మొదటగా అణ్వాయుధాలు వాడే ఆలోచన భారత్ ఎట్టి పరిస్థితిలోనూ చేయదు.. కానీ పాకిస్తాన్ ఏదైనా అనాలోచితంగా వ్యవహరిస్తే భారత్ కూడా గట్టిగా ధీటుగా బదులిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు